నూతన కార్యవర్గాన్ని 08 జూన్ 2013 ఎన్నుకున్నారు.
- అధ్యక్షుడిగా-- పి.ఆనందమోహన్,
- కార్యదర్శిగా-- పి.రాజశేఖర్,
- కోశాధికారిగా-- వై.లింగయ్య, ఎన్నికయ్యారు.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ పరిరక్షణకు మరింత శ్రమించాల్సిన అవసరముందని ఆ సంస్థ అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.విశ్వనాథ్ తెలిపారు. శనివారం స్థానిక ప్రెస్క్లబ్లో బీఎస్ఎన్ఎల్ 25వ వార్షిక మహాసభలు జరిగాయి. ఈ సభలో పాల్గొన్న విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు ప్రైవేటు ఆపరేటర్లకు అనుకూలంగా ఉంటున్నాయన్నారు. మహానగర్ టెలికం నిగమ్ లిమిటెడ్ను పునః వ్యవస్థీకరించాలని కోరారు. ఉద్యోగుల ప్రయోజనం కంటే సంస్థను అభివృద్ధి పథంలో నడిపించడమే మన తక్షణ కర్తవ్యమని చెప్పారు. జనరల్ మేనేజర్ హెచ్.సి.మహంతి మాట్లాడుతూ బీఎస్ఎన్ఎల్లో ఉండే ప్రతి ఉద్యోగి ఎంతో కష్టపడి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని కోరారు.
సహాయ రాష్ట్ర కార్యదర్శి పాణిగ్రహి వెంకటరావు, జిల్లా కార్యదర్శి పి.మధు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కార్యదర్శులు, సీడీడబ్ల్యుసీ, సీయూసీ సభ్యులు, డీజీఎం ఎ.వి.యోగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
- =====================
No comments:
Post a Comment